BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కంపెనీ అనుమతులు రద్దు చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 08:10 PM
174 వీక్షణలు
నూతన క్రషర్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: ఎమ్మెల్యేకు గోవింద్ తండా గ్రామస్తుల వినతి NTODAY NEWS: బొమ్మలరామారం మాదాపూర్ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 262లో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఎన్సీఎల్ లిమిటెడ్ క్రషర్ మిషన్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని గోవింద్ తండా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోవింద్ తండా నాయకులు, యువకులు, వార్డు సభ్యులు కలిసి గోవింద్ తండా సర్పంచ్ ధీరవత్ మంగ్త్య నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధీరవత్ మంగ్త్య నాయక్ మాట్లాడుతూ, మాదాపూర్ రెవెన్యూ శివారులోని భూములు తమ తాత–ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న క్రషర్ మిషన్ వల్ల ఏర్పడుతున్న దుమ్ము కాలుష్యంతో పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మరో కొత్త క్రషర్ మిషన్‌కు అనుమతి ఇవ్వడం వల్ల వ్యవసాయ భూములు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి గిరిజన రైతుల జీవనాధారమైన భూములను కాపాడాలంటే నూతన క్రషర్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, అనుమతుల నిలుపుదల అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడతానని, గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవింద్ తండా నాయకులు ధీరవత్ రవీందర్ నాయక్, ధీరవత్ బిక్కు నాయక్, ధీరవత్ రాజేష్ నాయక్, మాలు నాయక్, ధీరవత్ నవీన్ నాయక్, హచ్య నాయక్, బాలు నాయక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. #CrusherIssue #EnvironmentalConcern #FarmersRights #TribalIssues #StopPollution #SaveAgriculture #LocalProtest #Bommalaramaram #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube