BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
15 May, 2025 - 07:00 AM
337 వీక్షణలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం --- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బస్సు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించారు . అనంతరం మీడియాతో భువనగిరి ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అందులో భాగంగానే ఈరోజు స్థానికుల అవసరాల మేరకు నైట్ హాల్ట్ బస్సును ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే చిట్యాల సంబంధించి మరో అయిదు అదనపు బస్సులను ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం వట్టిమర్తిలో మొదటి విడతగా గ్రామంలో 55 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రజా పాలనలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి నిరుపేద, బలహీనవర్గాలకే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే భూమాత పోర్టల్ అందుబాటులోకి వచ్చి రైతుల సమస్యలను తీర్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube