రాచన్నగూడెంలో ‘పల్లె పల్లెకు ఎమ్మెల్యే చిర్రి అన్నా’ కార్యక్రమం
NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా: జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు లేకుండా చేయడమే తన ప్రధాన లక్ష్యమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా చేపట్టిన ‘పల్లె పల్లెకు ఎమ్మెల్యే చిర్రి అన్నా’ కార్యక్రమంలో భాగంగా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని గ్రామస్థులు తమ సమస్యలపై ఎమ్మెల్యే గారికి పిర్యాదులు సమర్పించారు. వాటిని స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సూచనలు, ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం రాచన్నగూడెం, జిల్లెళ్లగూడెం, లంకాలపల్లి గ్రామాల క్రీడాకారులకు ప్రోత్సాహకంగా వాలీబాల్ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి, ప్రధాన కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, జీలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు, రాజన్నగూడెం పంచాయతీ సర్పంచ్ సున్నం వరలక్ష్మి, ఎంపీటీసీ పుసం ఉదయ్ కుమార్,కూటమి నాయకులు వనమా వెంకటేశ్వరావు, పులుమోలు శివాజీ, కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, బండారు అనిల్, బోడపాటి వెంకటేశ్వరావు, కొప్పుల కార్తీక్, గొడుగుల కిరణ్, వీరమల్ల శ్రీను, పేరుబోయిన దాము, బరగడ రాజు,తోట పండు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube