BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

తెలంగాణ
06 Feb, 2026 - 08:28 PM
310 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం: హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO) కీలక పాత్ర పోషించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. శుక్రవారం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, అలాగే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన PO, APO శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సూచనలు: పోలింగ్ సామగ్రి ఉదయం 8 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఉండేలా చూసుకోవాలి. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సరిగ్గా వచ్చాయా లేదా ముందుగానే తనిఖీ చేయాలి. బ్యాలెట్ బాక్సులు సక్రమంగా ఓపెన్ అవుతున్నాయా లేదా పరీక్షించాలి. స్వస్తిక్ గుర్తు, మున్సిపాలిటీ స్టాంపులు పూర్తిగా ఉన్నాయా లేదో నిర్ధారించాలి. ప్రతి ఓటరు తన ఓటును సరైన విధంగా బ్యాలెట్ బాక్సులో వేస్తున్నాడా లేదా పర్యవేక్షించాలి. పోలింగ్ రోజున సమయపాలన పాటిస్తూ, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ పూర్తయ్యాక సామగ్రిని జాగ్రత్తగా రిసెప్షన్ కౌంటర్లలో అప్పగించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు, POలు, APOలు తదితరులు పాల్గొన్నారు. #MunicipalElections #TransparentElections #ElectionDuty #PresidingOfficer #YadadriBhuvanagiri #TelanganaElections #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube