BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ

తెలంగాణ
15 Feb, 2026 - 11:47 PM
98 వీక్షణలు
ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ – శ్రీశైలంలో మహాశివరాత్రి వైభవం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ ఘనంగా నిర్వహించబడింది. లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. చీరాల వాసి పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబానికి చెందిన పృథ్వి సుబ్బారావు భక్తిశ్రద్ధలతో 365 రోజుల పాటు ప్రతిరోజూ ఒక మూర చొప్పున నేత నేసి సిద్ధం చేసిన పాగాను స్వామివారికి సమర్పించారు. ఆలయ సంప్రదాయ పద్ధతులనుసరించి సుమారు రెండు గంటల పాటు పాగాలంకరణ నిర్వహించబడింది. ఈ సందర్భంగా భక్తులు ఏకస్వరంతో శివనామస్మరణ చేస్తూ క్షేత్రాన్ని మారుమోగించారు. అనంతరం నాగలకట్ట సమీపంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఉత్సవ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. #Srisailam #Mahashivaratri #Pagalankarana #Rudrabhishekam #TempleFestival #NandyalNews Follow us on Website Facebook Instagram YouTube