BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
22 Jan, 2026 - 09:05 AM
72 వీక్షణలు
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ధర్మపురిలో ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఇంటి నెంబర్ పత్రాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి: అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇంటి నెంబర్ పత్రాలను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. మహిళల గౌరవానికి చిహ్నం – ఇందిరమ్మ చీర ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక భద్రతతో పాటు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. “ఇందిరమ్మ చీరల పంపిణీ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు నిదర్శనం” అని పేర్కొన్నారు. మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. సొంతింటి కలను సాకారం చేస్తాం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. “అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు తప్పకుండా చేరాలి. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పని చేసి పారదర్శకంగా పథకాలను అమలు చేయాలి.” ఇంకా ఇంటి నెంబర్ పత్రాలు అందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అందరికీ పత్రాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. #Indiramma #WomenEmpowerment #WelfareGovernment #TelanganaWelfare #AdluriLaxmanKumar #PoorWelfare #IndirammaCheera #HousingForAll #Dharmapuri #PublicWelfare Follow us on Website Facebook Instagram YouTube