BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు

తెలంగాణ
12 Feb, 2026 - 09:04 AM
122 వీక్షణలు
మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పరిశీలన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు గురువారం పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాళ్ల ఏర్పాట్లు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని పేర్కొన్న కలెక్టర్, ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకత, సమయపాలనతో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #MunicipalElections #VoteCounting #ElectionUpdate #TelanganaNews #DistrictAdministration Follow us on Website Facebook Instagram YouTube