www.ntodaynews.com
పాల ఉత్పత్తుల్లో విశ్వాసమే మూలధనం
తెలంగాణ
పాల ఉత్పత్తుల్లో విశ్వాసమే మూలధనం – వైష్ణవి డెయిరీ 4వ శాఖ ప్రారంభం
NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: వీర్ల శ్రీనివాస్,
మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్లో వైష్ణవి డెయిరీ ప్రొడక్ట్స్ నాల్గవ శాఖ ఘనంగా ప్రారంభమైంది. ఈ శాఖను తులా సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎల్లపు సంఘం అధ్యక్షుడు కల్వాల సుధాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీర్ల మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా హాజరై దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, నాణ్యత మరియు విశ్వసనీయతే వ్యాపార విజయానికి కీలకమని పేర్కొన్నారు.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తిరుపతి యాదవ్, ప్రాంతీయ సేల్స్ మేనేజర్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుద్ధమైన పాల ఉత్పత్తులను అందించడం ద్వారా సంస్థ మంచి పేరు సంపాదించిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కు చెందిన రాచకొండ సుభాష్ రావు, మాజీ PACS చైర్మన్ సాల్వాజీ ప్రభాకర్ రావు, తులా మధుసూదన్ రావు, రాచకొండ శివతేజ రావు, రాపోల్ జనార్దన్ రావు, బీర్పూరి రఘుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
#Mancherial #VaishnaviDairy #DairyProducts #NewBranchOpening #BusinessNews #TelanganaBusiness #CustomerTrust #LocalBusiness
Follow us on
Website
Facebook
Instagram
YouTube