www.ntodaynews.com
కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
/
మేడ్చల్
వాజపేయ్ నగర్ లో కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం
కుత్బుల్లాపూర్: 131వ డివిజన్, వాజపేయి నగర్ శ్రీరామ మందిరంలో సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త కట్టా నాగరాజు దంపతుల ఆశీస్సులతో, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కట్టా కుమార్ దంపతులు కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో బీజేపీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ వర్మ దంపతులు, సీనియర్ నాయకులు రవి యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు సుజాత రాజశేఖర్, దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్డి కృష్ణయ్య, మహిళా నాయకురాలు మహేశ్వరి,విమేష్,, వసంత్,,చింటూ, అనిల్, శ్రీకాంత్ సహా పెద్ద సంఖ్యలో వాజ్పేయినగర్ వాసులు పాల్గొన్నారు