www.ntodaynews.com
వాట్సాప్ ఫైళ్లపై జాగ్రత్తలు చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి, మార్చి 23: వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద ఫైళ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ప్రజలకు హెచ్చరించారు.
ఆధార్, బ్యాంకు, ప్రభుత్వ చలానా వంటి పేర్లతో పంపించే ఫైళ్లు మోసపూరితమైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. వాటిని తెరిస్తే మొబైల్ ఫోన్లు దుర్వినియోగానికి గురై, వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
అలాగే, ఇలాంటి సందేశాలు బంధుమిత్రుల వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా రావచ్చని, వారి ఖాతాలు దుర్వినియోగం కావడంతో పంపబడే అవకాశం ఉందని చెప్పారు.
కాబట్టి అనుమానాస్పద ఫైళ్లు, లింకులు వచ్చినప్పుడు వెంటనే తొలగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సైబర్ నేర విభాగాన్ని సంప్రదించాలని ఎస్ఐ డి. రామకృష్ణ తెలిపారు.