BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వాట్సాప్ ఫైళ్లపై జాగ్రత్తలు చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:32 PM
151 వీక్షణలు

చాట్రాయి, మార్చి 23: వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద ఫైళ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ ప్రజలకు హెచ్చరించారు.

ఆధార్, బ్యాంకు, ప్రభుత్వ చలానా వంటి పేర్లతో పంపించే ఫైళ్లు మోసపూరితమైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. వాటిని తెరిస్తే మొబైల్ ఫోన్లు దుర్వినియోగానికి గురై, వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

అలాగే, ఇలాంటి సందేశాలు బంధుమిత్రుల వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా రావచ్చని, వారి ఖాతాలు దుర్వినియోగం కావడంతో పంపబడే అవకాశం ఉందని చెప్పారు.

కాబట్టి అనుమానాస్పద ఫైళ్లు, లింకులు వచ్చినప్పుడు వెంటనే తొలగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సైబర్ నేర విభాగాన్ని సంప్రదించాలని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.