BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 20 March 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:49 PM
151 వీక్షణలు

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

అంతర్జాతీయంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్స్, యునిక్ ఐడీలను ప్రవేశపెట్టే దిశగా సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే జూన్ నెలలో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పుతో యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండా కొత్త వ్యక్తులతో, గ్రూపులతో కనెక్ట్ కావచ్చని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలనుకునే వారికి ఫోన్ నంబర్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్లు అందుబాటులో ఉంచనున్నారు.

ఇక మరో కీలక పరిణామంగా, వాట్సాప్ యాప్ లేని వ్యక్తులతో కూడా చాట్ చేసే విధంగా ‘గెస్ట్ చాట్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే కమ్యూనికేషన్ వ్యవస్థలో మరింత విస్తరణ కలగనుంది.

ఈ మార్పులు అమల్లోకి వస్తే, యూజర్ల ప్రైవసీ రక్షణతో పాటు, డిజిటల్ కమ్యూనికేషన్‌లో కొత్త దశ ప్రారంభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.