BREAKING
నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
www.ntodaynews.com

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:49 PM
58 వీక్షణలు

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

అంతర్జాతీయంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్స్, యునిక్ ఐడీలను ప్రవేశపెట్టే దిశగా సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే జూన్ నెలలో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పుతో యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండా కొత్త వ్యక్తులతో, గ్రూపులతో కనెక్ట్ కావచ్చని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలనుకునే వారికి ఫోన్ నంబర్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్లు అందుబాటులో ఉంచనున్నారు.

ఇక మరో కీలక పరిణామంగా, వాట్సాప్ యాప్ లేని వ్యక్తులతో కూడా చాట్ చేసే విధంగా ‘గెస్ట్ చాట్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే కమ్యూనికేషన్ వ్యవస్థలో మరింత విస్తరణ కలగనుంది.

ఈ మార్పులు అమల్లోకి వస్తే, యూజర్ల ప్రైవసీ రక్షణతో పాటు, డిజిటల్ కమ్యూనికేషన్‌లో కొత్త దశ ప్రారంభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.