వైసీపీ సీనియర్ నాయకుడు చింతల భాస్కర రెడ్డి కన్నుమూత
వైసీపీ సీనియర్ నాయకుడు చింతల భాస్కర రెడ్డి కన్నుమూత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కర రెడ్డి విజయవాడలో చికిత్స పొందుతూ శివైక్యం చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని నరసాపురంలోని స్వగృహ ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చింతల భాస్కర రెడ్డి మృతి నరసాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఆయనకు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.