BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 May, 2026 - 07:49 PM
537 వీక్షణలు

400 కు పైగా కోళ్లు  మృతి! 

మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా

బోర్లు నడవక, నీరు అందక కోళ్లు మృత్యువాత

ప్రకృతి వైపరీత్యానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడైతే అన్నదాతకు ఎంతటి తీరని నష్టం జరుగుతుందో నిరూపించే విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతకు, తాగునీరు అందక పలు కోళ్ల ఫారంలో దాదాపు 400కు పైగా కోళ్లు మృతి చెందాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాలనరసింహస్వామి దేవస్థానం సమీపంలో కంభంపాటి సైదులు, ఐలాపురం ముత్యాలు అనే రైతులకు చెందిన కోళ్ల ఫారం ఉంది. కాగా, మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడ్డాయి. దీంతో కోళ్ల ఫారానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో బోర్లు పనిచేయలేదు. తీవ్రమైన ఉక్కపోతకు తోడు, చుక్క నీరు కూడా అందకపోవడంతో కళ్ల ముందే కోళ్లు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. లక్షల్లో నష్టం వాటిల్లిందివీ అని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ​​ఈ సంఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే తమకు ఈ ఘోర నష్టం తప్పేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.