BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 May, 2026 - 07:49 PM
499 వీక్షణలు

400 కు పైగా కోళ్లు  మృతి! 

మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా

బోర్లు నడవక, నీరు అందక కోళ్లు మృత్యువాత

ప్రకృతి వైపరీత్యానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడైతే అన్నదాతకు ఎంతటి తీరని నష్టం జరుగుతుందో నిరూపించే విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతకు, తాగునీరు అందక పలు కోళ్ల ఫారంలో దాదాపు 400కు పైగా కోళ్లు మృతి చెందాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాలనరసింహస్వామి దేవస్థానం సమీపంలో కంభంపాటి సైదులు, ఐలాపురం ముత్యాలు అనే రైతులకు చెందిన కోళ్ల ఫారం ఉంది. కాగా, మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడ్డాయి. దీంతో కోళ్ల ఫారానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో బోర్లు పనిచేయలేదు. తీవ్రమైన ఉక్కపోతకు తోడు, చుక్క నీరు కూడా అందకపోవడంతో కళ్ల ముందే కోళ్లు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. లక్షల్లో నష్టం వాటిల్లిందివీ అని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ​​ఈ సంఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే తమకు ఈ ఘోర నష్టం తప్పేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.