BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 29 March 2026, 02:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

30 సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 02:56 PM
141 వీక్షణలు

విశాఖలో గ్యాస్ సిలిండర్ మోసం – 30 సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..!

విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం చోటుచేసుకుంది. చిన్నగంట్యాడ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న అప్పారావు అనే డెలివరీ బాయ్, కస్టమర్లను మోసం చేసి 30 గ్యాస్ సిలిండర్లతో పరారయ్యాడు.

సమాచారం ప్రకారం, డెలివరీకి వెళ్లే ముందు కస్టమర్ల వద్ద నుంచి OTPలను తీసుకుని, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టు చూపించి వాటిని అప్పగించకుండా మాయమయ్యాడు. ఈ విధంగా సుమారు 30 సిలిండర్లను అక్రమంగా దోచుకుని తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.