BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:49 PM
88 వీక్షణలు

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ: తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

కారుణ్య నియామకాల విషయంలో వివాహిత కుమార్తెలను అనర్హులుగా పరిగణించడం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య నియామకానికి అర్హులేనని పేర్కొంది.

కేవలం వైవాహిక స్థితి ఆధారంగా మహిళల హక్కులను పరిమితం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. కుటుంబంపై ఆధారపడే స్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిందే గానీ, వివాహిత అనే కారణంతో అవకాశాలను నిరాకరించరాదని వెల్లడించింది.

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న పలువురు వివాహిత కుమార్తెలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.