www.ntodaynews.com
వృత్తి కులాల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలి
తెలంగాణ
/
తెలంగాణ
మంచిర్యాల (MNCL):
రాష్ట్ర బడ్జెట్లో వృత్తి కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.25 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కేంద్రంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కులవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల ప్రభావం వల్ల సుమారు 25 లక్షల మంది కులవృత్తిదారులు తమ జీవనోపాధిని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి బడ్జెట్లో సరైన నిధులు కేటాయిస్తే, ఆయా వృత్తులను ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా వృత్తిదారులు గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.