BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వృత్తి కులాల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలి

తెలంగాణ
/ తెలంగాణ
17 Mar, 2026 - 11:38 AM
163 వీక్షణలు

మంచిర్యాల (MNCL):

రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తి కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.25 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కేంద్రంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కులవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

​పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల ప్రభావం వల్ల సుమారు 25 లక్షల మంది కులవృత్తిదారులు తమ జీవనోపాధిని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయిస్తే, ఆయా వృత్తులను ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా వృత్తిదారులు గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.