BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వ్యాపారులకు మరో భారం.. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:14 PM
111 వీక్షణలు

వ్యాపారులకు మరో భారం.. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంచగా, హైదరాబాద్‌లో రూ.52 పెరిగింది.

తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50కు చేరుకోగా, కోల్‌కతాలో రూ.3,255.50గా ఉంది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరింది.

అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరపై కూడా రూ.11 పెంపు విధించారు. అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరటనిస్తూ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.