వ్యాపారులకు మరో భారం.. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు
వ్యాపారులకు మరో భారం.. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు
దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఢిల్లీలో రూ.42 పెంచగా, హైదరాబాద్లో రూ.52 పెరిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50కు చేరుకోగా, కోల్కతాలో రూ.3,255.50గా ఉంది. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరింది.
అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరపై కూడా రూ.11 పెంపు విధించారు. అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరటనిస్తూ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.