BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

“విజయకేత” పుస్తకాల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ
22 Nov, 2025 - 04:28 AM
161 వీక్షణలు
ఏలూరు జిల్లాలో   “విజయకేత” పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ NTODAY NEWS: ఏలూరు జిల్లా  స్టాఫ్ రిపోర్టర్-కళ్యాణ్ కుమార్. శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఏలూరు జిల్లాలో ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి పేద విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపుకు లక్ష్యంగా రూపొందించిన “విజయకేత” పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ , ఎలూరు శాసన సభ్యులు శ్రీ బడేటి చంటి ఉడా ఛైర్పర్సన్ శ్రీ పెద్దిబోయిన వాణి వెంకట శివ ప్రసాద్ ఏలూరు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ పెన్మెత్స శ్రీనివాస రాజు మరియు జిల్లా విద్యా అధికారిణి శ్రీమతి ఎం. వెంకట లక్ష్మమ్మ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ - జిల్లాలో పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా “విజయకేత” పుస్తకాలు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించబడినవి అని తెలిపారు. గత సంవత్సరం ఈ పుస్తకాల వలన 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube