BREAKING
​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
www.ntodaynews.com

మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి

తెలంగాణ
08 Mar, 2026 - 10:24 AM
136 వీక్షణలు
మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కరీంనగర్ కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహిళలు శక్తి స్వరూపులని, వారు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ ఇతర జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు.   మహిళా సాధికారతే నూతన భారత్ బలం ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మహిళా సాధికారత దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్య, సాంకేతికత, రాజకీయాలు, వ్యాపారం వంటి రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. మహిళల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ సంబరాలు అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్‌లను మహిళా అధికారులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధ, సీడీపీఓలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం విద్యాశాఖ సమగ్ర శిక్షణ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో భద్రత, సరైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా సిబ్బంది, సీఆర్పీలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ మాధవి, ఏసీజీఈ సంధ్యారాణి, కోఆర్డినేటర్లు మిలుకూరి శ్రీనివాస్, కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సిబ్బంది ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. #InternationalWomensDay #DroupadiMurmu #Karimnagar #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube