BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి

తెలంగాణ
08 Mar, 2026 - 10:24 AM
191 వీక్షణలు
మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కరీంనగర్ కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహిళలు శక్తి స్వరూపులని, వారు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ ఇతర జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు.   మహిళా సాధికారతే నూతన భారత్ బలం ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మహిళా సాధికారత దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్య, సాంకేతికత, రాజకీయాలు, వ్యాపారం వంటి రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. మహిళల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ సంబరాలు అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్‌లను మహిళా అధికారులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధ, సీడీపీఓలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం విద్యాశాఖ సమగ్ర శిక్షణ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో భద్రత, సరైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా సిబ్బంది, సీఆర్పీలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ మాధవి, ఏసీజీఈ సంధ్యారాణి, కోఆర్డినేటర్లు మిలుకూరి శ్రీనివాస్, కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సిబ్బంది ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. #InternationalWomensDay #DroupadiMurmu #Karimnagar #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube