BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:06 PM
148 వీక్షణలు

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు.. ‘నందూస్ వరల్డ్’ దంపతులపై కేసు నమోదు

యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామంటూ భారీ మొత్తాలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్పై కేసు నమోదైనట్లు సమాచారం.

గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపును ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు నిర్వహించి విదేశీ ఉద్యోగాలు, వీసా సేవలు అందిస్తామని చెప్పి కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు, వీసా రెన్యూవల్ మరియు తన భార్యకు ఉద్యోగం కోసం CoS ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. 2023లో నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది నవంబరులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు, మధుకర్‌ను A1గా, రమానందనను A2గా, మోహన్‌రావును A3గా చేర్చినట్లు సమాచారం. నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదని ప్రచారం జరుగుతోంది.

కేసును కొట్టివేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా తమను బాధితులమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై కోర్టు తుది తీర్పు వెలువడాల్సి ఉంది.