BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:06 PM
76 వీక్షణలు

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు.. ‘నందూస్ వరల్డ్’ దంపతులపై కేసు నమోదు

యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామంటూ భారీ మొత్తాలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్పై కేసు నమోదైనట్లు సమాచారం.

గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపును ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు నిర్వహించి విదేశీ ఉద్యోగాలు, వీసా సేవలు అందిస్తామని చెప్పి కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు, వీసా రెన్యూవల్ మరియు తన భార్యకు ఉద్యోగం కోసం CoS ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. 2023లో నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది నవంబరులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు, మధుకర్‌ను A1గా, రమానందనను A2గా, మోహన్‌రావును A3గా చేర్చినట్లు సమాచారం. నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదని ప్రచారం జరుగుతోంది.

కేసును కొట్టివేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా తమను బాధితులమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై కోర్టు తుది తీర్పు వెలువడాల్సి ఉంది.