www.ntodaynews.com
ఈ యాప్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చు
తెలంగాణ
బిఐఎస్ కేర్ యాప్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చు--కొడారి వెంకటేష్
వినియోగదారుల ప్రతినిధి
NTODAY NEWS: భువనగిరి
భారత దేశంలో సుమారు 725 వస్తువుల ఉత్పత్తుల పై బిఐఎస్ అనుమతులు అవసరం ఉందని, ఏవైనా వస్తువుల నాణ్యత విషయంలో సమస్యలు వస్తే బిఐఎస్ కేర్ యాఫ్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చని వినియోగదారుల ప్రతినిధి కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ గృహ ఉపకరణాలు, బంగారు, వెండి ఆభరణాలు, కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యత నియంత్రణ పద్ధతులు తెలుసుకొని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ప్రతి వస్తువు మీద బిఐఎస్, ఐఎస్ఐ, ఆగ్మార్క్, మరియు ఆల్ మార్క్ లలో ఏదోఒకటి ఉండాలని ఆయన సూచించారు. వినియోగదారులు బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా ఆల్ మార్క్ ఉంటేనే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. జిల్లా అధికారులను కలిసి బ్రోచర్లు అందజేసి, బిఐఎస్ గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వాలంటీర్లు తోట సాయి ప్రణీత్, ఆకోజు విరాట్ లు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube