www.ntodaynews.com
11 మంది మావోయిస్టులు లొంగుబాటు
జాతీయం
11 మంది మావోయిస్టులు లొంగుబాటు
గడ్చిరోలి, మార్చి 19 : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో డివిజనల్ కమిటీ మెంబర్ (డీవీసీఎం), ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి కీలక నేతలు కూడా ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పునరావాస, సమాధాన చర్యల ఫలితంగా మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా, 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు.