అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం అమలు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు
అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు 'తల్లికి వందనం' అమలు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు
అమరావతి, జులై 22: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసినందుకు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ప్రతినిధి గోల్లపూడి మల్లిక వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి లక్ష్మీనరసమ్మ, ప్రతినిధులు బి. కళ్యాణి, జి. ముని లక్ష్మి పాల్గొన్నారు.