www.ntodaynews.com
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద రైతులకు రూ.3,125 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్
రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాల కింద మొత్తం రూ.3,125.47 కోట్లు విడుదల చేయనున్నారు.
ఈ నెల 20న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు సాయం విడుదల చేయనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమబెంగాల్లోని తారకేశ్వర్లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 జమ కానుంది. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 చొప్పున అందనుంది.
మొత్తం 45,69,817 మంది పట్టాదారులు, 1,16,021 మంది అటవీ హక్కు సాగుదారుల కుటుంబాలకు ఈ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.