BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

భీమడోలులో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:05 PM
16 వీక్షణలు

భీమడోలు, జూలై 22: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డయల్-112, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా భద్రత, బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ ఎస్‌కే మదీనా బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం ద్వారా బాలబాలికలకు లభించే రక్షణ, లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాల్సిన అవసరాన్ని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించాలని సూచించారు.

సోషల్ మీడియా వినియోగంలో అపరిచితుల పరిచయాలు, ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అవి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని తెలిపారు. అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఉపయోగించాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.