చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పేదలకు ధీమా ఇచ్చే పథకం అని పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు వ్యాఖ్య
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేద ప్రజలు ధీమాగా జీవిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్గా రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 అందిస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు.
పేద కుటుంబాలకు చంద్రబాబు పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, గద్ధల ఆంటోనీ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.