ఎరుకోపాడులో 30 లక్షల చేప పిల్లల విడుదల
ఎరుకోపాడులో 30 లక్షల చేప పిల్లల విడుదల
తిరువూరు, జూలై 22: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఎరుకోపాడు క్యాప్టివ్ సీడ్ నర్సరీ చెరువులో బుధవారం 30 లక్షల చిరు చేప పిల్లలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాస్త్రీయ ప్రణాళికతో చేప పిల్లల ఉత్పత్తి, నిల్వ కార్యక్రమాలను చేపట్టి మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం గంపలగూడెం మండలం వెంగళయ్య చెరువులో మరో 30 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.