BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి

జాతీయం
22 Mar, 2026 - 09:44 AM
180 వీక్షణలు

బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి 

నెట్‌వర్క్ బలోపేతం కోసం వ్యూహాత్మక ఒప్పందం

దేశీయ టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ (BSNL) మరియు ప్రైవేట్ రంగ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తమ వనరులను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రెండు సంస్థలు తమ వద్ద ఉన్న మొబైల్ టవర్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను సంయుక్తంగా వినియోగించుకోనున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్ ని కూడా పరస్పరం పంచుకోనున్నారు. విడివిడిగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే భారీ వ్యయాన్ని తగ్గించుకోవడమే ఈ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందం వల్ల రెండు నెట్‌వర్క్‌ల పరిధి పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు తొలగి, కాల్ డ్రాప్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంటర్నెట్ వేగంతో పాటు నెట్‌వర్క్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థల పోటీని తట్టుకునేందుకు ఈ వ్యూహం ఎంతగానో దోహదపడనుంది.