BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

గంపలగూడెంలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 07:57 PM
19 వీక్షణలు

గంపలగూడెంలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

గంపలగూడెం, జూలై 22: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం పర్యటించి, స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

కేంద్రంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీ తదితర ఎరువుల నిల్వలను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలు, రైతులకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందుబాటులో ఉంచడంతో పాటు పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్‌) యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని సూచించారు. ప్రతి ఎరువుల దుకాణంలో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎరువుల పంపిణీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నంబర్ 91549 70454 లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.