BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

యాదగిరిగుట్టలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

తెలంగాణ
30 Mar, 2025 - 03:39 AM
290 వీక్షణలు
N TODAY NEWS: యాదగిరిగుట్ట మండలం, మార్చ్ 30 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా యాదగిగుట్ట ఆలయ అర్చకులచే శ్రీ విశ్వక్సేన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పంచాంగ శ్రవణాన్ని పఠనం చేసారు.ఈ కార్యక్రమంలో బీర్ల అయిలయ్య దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పట్టం కడుతూ జరుపుకునే పండుగ ఉగాది పండుగ అన్నారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నలుమూలల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని, ప్రముఖ దేవాలయాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని. ఈ నేపథ్యంలో యాదిగిరిగుట్టలోని తమ స్వగృహంలో కూడా ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించామని బీర్ల అయిలయ్య అన్నారు..ఈ సంవత్సరం రైతులకు మంచి రోజులు రానున్నాయని ఇటు పకృతి పరంగా ప్రభుత్వం పరంగా రైతులకు మంచి జరుగుతుందని ఆశించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా సమృద్ధిగా కురుస్తాయని, ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని బీర్ల ఐలయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు,యాదగిరిగుట్ట మండల, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు