www.ntodaynews.com
జైపూర్ కేజీబీవీలో ప్రమాదం
తెలంగాణ
/
మంచిర్యాల
/
జైపూర్
జైపూర్ కేజీబీవీలో ప్రమాదం - సీసీ కెమెరాలు బిగిస్తూ యువకుడు మృతి
జైపూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు స్టాండ్ పైనుంచి కిందపడి మంచిర్యాలకు చెందిన తోగిటి శివ (29) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న శివ, ఆదివారం జైపూర్ కేజీబీవీలో కెమెరాలు అమర్చే పనుల నిమిత్తం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన శివను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి