BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 01:42 PM
125 వీక్షణలు

​ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు – రైతుల పక్షాన పోరాట హెచ్చరిక

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేయడం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా విమర్శించారు.

గత కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సర్వత్రా జలకళ ఉట్టిపడేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఎల్లంపల్లి వంటి కీలక జలాశయాలను ఎడారిలా మారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేవలం మాటలకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను వంచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే రైతులకు భరోసా కల్పించకపోతే, సామాన్య జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు