BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 01:42 PM
101 వీక్షణలు

​ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు – రైతుల పక్షాన పోరాట హెచ్చరిక

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేయడం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా విమర్శించారు.

గత కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సర్వత్రా జలకళ ఉట్టిపడేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఎల్లంపల్లి వంటి కీలక జలాశయాలను ఎడారిలా మారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేవలం మాటలకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను వంచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే రైతులకు భరోసా కల్పించకపోతే, సామాన్య జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు