BREAKING
​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గుంటుక యాకమ్మను పరామర్శించిన కంటాయపాలెం గ్రామ సర్పంచ్ ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గుంటుక యాకమ్మను పరామర్శించిన కంటాయపాలెం గ్రామ సర్పంచ్
www.ntodaynews.com

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా..

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:01 PM
34 వీక్షణలు

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..!

శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో ఉన్న 1228 నాటి పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల పీఠం భాగం నుంచి ఎర్రటి వర్ణంలో ఉన్న ద్రవం వెలువడుతున్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా శిలా విగ్రహాల నుంచి ఇలాంటి ద్రవాలు రావడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తుల్లో భక్తి భావంతో పాటు ఆందోళన కూడా నెలకొంది.

ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగాంతానికి ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెట్టడం, రక్తం కార్చడం వంటి సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనను అదే కాలజ్ఞానంతో ముడిపెట్టి కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై అధికారికంగా ఆలయ నిర్వాహకులు లేదా పురావస్తు, శాస్త్ర నిపుణులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్రవం ఎలా వస్తోంది? దాని స్వరూపం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.