BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా..

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:01 PM
116 వీక్షణలు

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..!

శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో ఉన్న 1228 నాటి పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల పీఠం భాగం నుంచి ఎర్రటి వర్ణంలో ఉన్న ద్రవం వెలువడుతున్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా శిలా విగ్రహాల నుంచి ఇలాంటి ద్రవాలు రావడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తుల్లో భక్తి భావంతో పాటు ఆందోళన కూడా నెలకొంది.

ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగాంతానికి ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెట్టడం, రక్తం కార్చడం వంటి సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనను అదే కాలజ్ఞానంతో ముడిపెట్టి కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై అధికారికంగా ఆలయ నిర్వాహకులు లేదా పురావస్తు, శాస్త్ర నిపుణులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్రవం ఎలా వస్తోంది? దాని స్వరూపం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.