BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా..

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:01 PM
211 వీక్షణలు

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..!

శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో ఉన్న 1228 నాటి పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల పీఠం భాగం నుంచి ఎర్రటి వర్ణంలో ఉన్న ద్రవం వెలువడుతున్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా శిలా విగ్రహాల నుంచి ఇలాంటి ద్రవాలు రావడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తుల్లో భక్తి భావంతో పాటు ఆందోళన కూడా నెలకొంది.

ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగాంతానికి ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెట్టడం, రక్తం కార్చడం వంటి సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనను అదే కాలజ్ఞానంతో ముడిపెట్టి కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై అధికారికంగా ఆలయ నిర్వాహకులు లేదా పురావస్తు, శాస్త్ర నిపుణులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్రవం ఎలా వస్తోంది? దాని స్వరూపం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.