www.ntodaynews.com
కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్.. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో రెండు ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కొంతమంది ఆలయ సిబ్బంది అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలో నకిలీ రూ.500 టికెట్ల వ్యవహారంలో ఈవో ఫిర్యాదు ఆధారంగా హోంగార్డ్ చంద్రశేఖర్పై చర్యలు తీసుకున్న పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.
తాజాగా వెలుగుచూసిన మరో ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఆలయ అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు.
టికెట్ విక్రయాల్లో అవకతవకలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.