BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్.. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 03:10 PM
90 వీక్షణలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో రెండు ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. కొంతమంది ఆలయ సిబ్బంది అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గతంలో నకిలీ రూ.500 టికెట్ల వ్యవహారంలో ఈవో ఫిర్యాదు ఆధారంగా హోంగార్డ్ చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకున్న పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.

తాజాగా వెలుగుచూసిన మరో ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఆలయ అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు.

టికెట్ విక్రయాల్లో అవకతవకలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.