BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి వెండి శఠారు విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 07:43 PM
61 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి భక్తుడు చీటి ప్రసాదు–త్రివేణి దంపతులు తమ కుమార్తె ఊహన్సీ పేరున రూ.40 వేల విలువైన 158 గ్రాముల వెండి శఠారును సోమవారం ఆలయానికి సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం (కే.జీ) గ్రామానికి చెందిన దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వెండి శఠారును ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్యామ్ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో దాత కుటుంబాన్ని ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన చీటి ప్రసాదు–త్రివేణి కుటుంబానికి ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.