www.ntodaynews.com
మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి వెండి శఠారు విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి భక్తుడు చీటి ప్రసాదు–త్రివేణి దంపతులు తమ కుమార్తె ఊహన్సీ పేరున రూ.40 వేల విలువైన 158 గ్రాముల వెండి శఠారును సోమవారం ఆలయానికి సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం (కే.జీ) గ్రామానికి చెందిన దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వెండి శఠారును ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్యామ్ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో దాత కుటుంబాన్ని ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన చీటి ప్రసాదు–త్రివేణి కుటుంబానికి ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.