www.ntodaynews.com
మంచిర్యాల ఏబీసీ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆండాలమ్మ కాలనీ డంప్ యార్డు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఏబీసీ కేంద్రాన్ని మేయర్ దర్ణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్తో కలిసి శనివారం పరిశీలించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన వారు అక్కడ అందిస్తున్న సేవలపై అధికారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏబీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ను పరిశీలించిన మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కలకు ఇక్కడ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వివరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.