BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​మంచిర్యాల: కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలకం – సీపీ అంబర్ కిషోర్ ఝా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 07:41 PM
56 వీక్షణలు

నేరస్థులకు శిక్ష పడటంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

​పలు కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ సిబ్బందిని, కోర్టు లైజనింగ్ అధికారులను సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.

​అనంతరం సీపీ మాట్లాడుతూ... ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, శారీరక దాడులు వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిందితులకు తగిన శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని, సమాజంలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు