BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 10:59 AM
101 వీక్షణలు

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి: భయాందోళనలో విద్యార్థులు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడికి తెగబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి హాస్టల్ నుంచి నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చిన విద్యార్థుల ముందు ఇద్దరు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ ప్రమాదకరంగా కట్ కొట్టగా, దీనిని ప్రశ్నించినందుకు సదరు యువకులు "ఇది మా ఊరు రోడ్డు.. మీరు ఇక్కడ నడవవద్దు" అంటూ విద్యార్థులపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో ఒక విద్యార్థికి గాయాలవ్వగా, బాధితులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్న విద్యార్థులు క్యాంపస్ బయటకు రావాలంటేనే వణుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, కళాశాల యాజమాన్యం స్థానికులతో మాట్లాడుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. దీనిపై స్థానిక ఎస్సై స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు