BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 10:59 AM
69 వీక్షణలు

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి: భయాందోళనలో విద్యార్థులు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడికి తెగబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి హాస్టల్ నుంచి నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చిన విద్యార్థుల ముందు ఇద్దరు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ ప్రమాదకరంగా కట్ కొట్టగా, దీనిని ప్రశ్నించినందుకు సదరు యువకులు "ఇది మా ఊరు రోడ్డు.. మీరు ఇక్కడ నడవవద్దు" అంటూ విద్యార్థులపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో ఒక విద్యార్థికి గాయాలవ్వగా, బాధితులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్న విద్యార్థులు క్యాంపస్ బయటకు రావాలంటేనే వణుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, కళాశాల యాజమాన్యం స్థానికులతో మాట్లాడుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. దీనిపై స్థానిక ఎస్సై స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు