BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసుల వినూత్న చర్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:06 PM
9 వీక్షణలు

ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసుల వినూత్న చర్య ప్రమాదకర ప్రాంతాల్లో రెట్రో రిఫ్లెక్టివ్ హెచ్చరిక డ్రమ్ముల ఏర్పాటు

ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు, కైకలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ పర్యవేక్షణలో, కలిదిండి ఎస్‌ఐ ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రత కార్యక్రమాన్ని అమలు చేశారు.

కలిదిండి మండలం మద్వానిగూడెం నుంచి కోరుకొల్లు వరకు ఉన్న రాష్ట్ర రహదారి–19పై గతంలో తరచూ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు, అధిక వేగంతో వాహనాలు ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ సుమారు 65 ప్లాస్టిక్ డ్రమ్ములకు రెట్రో రిఫ్లెక్టివ్ టేపులు అమర్చి హెచ్చరిక సూచికలుగా ఏర్పాటు చేశారు.

పగలు, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రూపొందించిన ఈ డ్రమ్ములు వాహనదారులకు ముందస్తు హెచ్చరికగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో దృశ్యమానత పెరగడంతో వాహనదారులు వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. "వేగం తగ్గించండి... ప్రాణాలను కాపాడండి" అనే సందేశంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.