www.ntodaynews.com
అన్నారంలో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్..
తెలంగాణ
/
నిజామాబాద్
/
ఆర్మూర్
డొంకేశ్వర్: మండలం, అన్నారం గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శుక్రవారం (భూమి పూజ ) శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆట్బోలి సంజీవ్ మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధుల నుండి రూ. 10 లక్షల వ్యయంతో ఈ మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భవనం గ్రామంలోని మహిళలందరికీ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను స్వయం సమృద్ధులుగా మార్చడమే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన కొనియాడారు.మహిళా సంఘాల సభ్యులందరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించి తమ కుటుంబాలను ప్రగతి పథంలో నడిపించాలని ఆయన సూచించారు..
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల సభ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు.