రోడ్లు మరమ్మతులు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్...
రోడ్లు మరమ్మతులు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్...
అన్నమయ్య జిల్లా.పుంగనూరు
గత కొద్ది సంవత్సరాలుగా రోడ్లు దుర్భరంగా మారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఏర్పడడంతో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పుంగనూరు పట్టణానికి చెందిను ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగునూరు బెంగుళూరు ప్రధాన రహదారి దుర్భరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యముని ఆయన అన్నారు. గతంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పుంగునూరు నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం బోయకొండకు నిత్యం కర్ణాటక నుంచి వేలాదిమంది వాహనాల్లో తరలివస్తుంటారు. రోడ్లు దుర్గంగా ఉండడంతో వాహన దారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించేంతవరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు.