www.ntodaynews.com
టీటీడీ చైర్మన్ను వెంటనే తొలగించాలి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
టీటీడీ చైర్మన్ను వెంటనే తొలగించాలి – నూజివీడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పూజలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మాజీ శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.