BREAKING
శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
www.ntodaynews.com

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 May, 2026 - 08:10 AM
61 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం : కూనూరు సంజయ్ దాస్ గౌడ్ NTODAY NEWS చిట్యాల 

రాష్ట్ర కమిటీతో పాటు ఉమ్మడి జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీర కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కూనూరు సంజయ్ దాసు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలు, అలాగే ఎన్నో కష్టనష్టాలు భరించి ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.

అయితే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక స్థాయిలో కమిటీలు ఉంటే నిజమైన ఉద్యమకారులను గుర్తించడం సులభమవుతుందని, అర్హులైన వారందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం, గుర్తింపు, సంక్షేమం అందుతుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ పరంగా సరైన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున శ్రీ కూనూరు సంజయ్ దాసు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.