www.ntodaynews.com
తిరువూరు టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు, జూలై 22: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని లక్ష్మీపురం మను గార్డెన్స్లో తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.