తిరువూరులో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం
తిరువూరులో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం
తిరువూరు, జూలై 22:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు ఆర్టీసీ బస్టాండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ చైతన్య రథం ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరువూరు పట్టణ ఎస్ఐ శాతకర్ణి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనుమానాస్పద సందేశాలు, అపరిచితులు చరవాణికి పంపించే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సందేహాస్పద కాల్స్, సందేశాలు లేదా ఆన్లైన్ మోసాలకు గురైన వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.