www.ntodaynews.com
విద్యుత్ షాక్తో గేదె మృతి.. రైతు కుటుంబంలో విషాదం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి, జూలై 22: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందింది.
గేదె మృతి చెందడంతో తమ జీవనాధారాన్ని కోల్పోయిన బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కుటుంబం ఆర్థికంగా నష్టపోయిందని గ్రామస్థులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం, తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.