www.ntodaynews.com
జియాపల్లి గ్రామంలో వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
జియాపల్లి గ్రామంలో వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమం
లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
జియాపల్లి గ్రామంలో లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీటర్ల వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ సభ్యులు మన్నె బాలరాజు ప్రారంభించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మన్నె రమ్య, మాజీ సర్పంచ్ మన్నె రాజేశ్వర్, వార్డ్ సభ్యుడు రఘునాకర్, యువ నాయకులు సాయినాథ్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.