www.ntodaynews.com
తెలంగాణ శాసనసభకు ముగ్గురు ప్రభుత్వ విప్ల నియామకం
తెలంగాణ
/
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ముగ్గురు సభ్యులను ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ ఉత్తర్వు (G.O.Ms.No.42) వెలువడింది. ప్రభుత్వ విప్ లు గా చింతకుంట విజయ రమణ రావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే మార్చి 18, 2026 నుండి తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సభలో క్రమశిక్షణను పర్యవేక్షించడం మరియు పార్టీ ఆదేశాలను (విప్) అమలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించాలని సంబంధిత విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.